![]() |
![]() |
.webp)
సినిమా నటులకి , సీరియల్ నటులకి షూటింగ్ లొకేషన్ కి వెళ్తే ప్యాకప్ అయ్యేంతవరకు తీరిక ఉండదు. అలా ఒక్కోసారి షూటింగ్ టైమ్ రాత్రి పన్నెండు కూడా దాటొచ్చు. అలాంటివి చాలా సినిమాల షూటింగ్ లలో మనం రెగ్యులర్ చూస్తుంటాం. అయితే సీరియల్స్ కూడా ఈ మధ్య అర్థరాత్రి వరకు కొనసాగుతున్నాయి. అదే విషయాన్ని తెలుపుతూ భావన లాస్య తన ఇన్ స్ట్రాగ్రామ్ లో ఓ పోస్ట్ చేసింది. అదేంటో ఓసారి చూసేద్దాం.
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న మల్లీ సీరియల్ లోని మల్లి అలియాస్ భావన లాస్య చేరింది. మల్లిగా అందరికి పరిచయమైన భావన లాస్య.. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో జన్మించింది. భావన తండ్రి రైల్వే ఉద్యోగి. కరోనా లాక్ డౌన్ సమయంలో తను చేసిన ఇన్ స్టాగ్రామ్ రీల్స్ కి విశేషమైన స్పందన రావడంతో, మల్లి సీరియల్ మేకర్స్ తనని సంప్రదించగా తను నటించడానికి ఒకే అంది. ఇప్పటివరకు టెలివిజన్ సీరియల్స్ లో నటించిన భావన లాస్యకి 'మల్లి' తన తొలి తెలుగు సీరియల్. కాగా ఇందులో లాస్య ప్రియ ముఖ్య పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే.
టీవి యాక్టర్స్ ఈ మధ్య ఇన్ స్టాగ్రామ్ రీల్స్ తో ఫేమస్ అవుతున్నారు. అందులో బ్రహ్మముడి సీరియల్ టీమ్ టాప్ లో ఉన్నారు. కాగా ఇప్పుడు మల్లి సీరియల్ లోని లాస్య ప్రియ కూడా చేరింది. ఆ మధ్య 'సమ్మోహనుడ' పాటకి అదిరిపోయే లుక్స్తో హాట్ సారీతో డ్యాన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఇప్పుడేమో తన ఇమ్ స్టాగ్రామ్ లో స్లీప్ లెస్ డేస్ అంటూ ఓ పోస్ట్ చేసింది. తను చేస్తోన్న సీరియల్ షూటింగ్ టైమ్ పెంచి మరీ తనకి నిద్రలేకుండా చేస్తున్నారని, నో స్లీప్ డేస్ అని చెప్పి అర్థరాత్రి ఒంటి గంట అవుతున్నట్లుగా టైమ్ కూడా పోస్ట్ చేసింది. అయితే ఆ ఫోటోని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా అది ఇప్పుడు ఫుల్ వైరల్ గా మారింది. మరి మల్లి సీరియల్ లో భావన లాస్య నటనకి మీలో ఎంతమంది అభిమానులున్నారు కామెంట్ చేయండి.
![]() |
![]() |